iDreamPost

విద్యార్థితో ప్రిన్సిపల్ రొమాంటిక్ ఫోటోలు వైరల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

సమాజంలో గొప్ప పొజీషన్ లోకి రావాలంటే.. గొప్ప చదువు ఉండాలి. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో ఉన్నతస్థాయికి తీసుకురావడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంటుంది.

సమాజంలో గొప్ప పొజీషన్ లోకి రావాలంటే.. గొప్ప చదువు ఉండాలి. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో ఉన్నతస్థాయికి తీసుకురావడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంటుంది.

విద్యార్థితో ప్రిన్సిపల్ రొమాంటిక్ ఫోటోలు వైరల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజంలో గొప్ప పొజిషన్ కి చేరేందుకు దోహదపడతారు ఉపాధ్యాయులు. అందుకే గురువును ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తారు. గురు-శిష్యుల మద్య గొప్ప అనుబంధం ఉంటుంది. అలాంటిది ఈ మద్య కొంతమంది గురువు స్థానానికి మచ్చ తెస్తున్నారు. విద్యార్థులకు ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు. వావి వరుసలు మర్చిపోయి ప్రేమలో పడిపోతున్నారు. తల్లిదండ్రులు చదువుకోమని స్కూల్స్, కాలేజీలకు పంపితే.. టీచర్లతో ప్రేమాయణాలు కొనసాగిస్తున్నారు. ఓ పదవతరగతి విద్యార్థి తాను చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ తో ప్రేమాయణం నడిపాడు.. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పాఠశాలకు చక్కగా చదువుకోమని పంపితే.. అక్కడ ప్రిన్సిపల్ మేడమ్ తో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ ఓ విద్యార్థి అబాసుపాలయ్యాడు. వావి వరుసలు మరిచి గురువు స్థానానికి మచ్చ తెచ్చిన ప్రిన్స్‌పల్, విద్యార్తిపై నెటిజన్లు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని మురగమల్లా గ్రామం.. అక్కడ ఓ పాఠశాల విద్యార్థులు, సిబ్బంది కలి పిక్ నిక్ కి వెళ్లారు. ఆ సమయంలో ప్రిన్సిపల్ తన విద్యార్థితో సినిమా తరహాలో కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటూ ఫోటోలు తీయించుకున్నారు. సదరు విద్యార్థి పదవ తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఈ ఫోటోలు నెట్టంట వైరల్ అయ్యాయి.. అంతే విద్యార్థి తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. వెంటనే బ్లాక్ ఎడ్యూకేషన్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేయడమే కాదు.. ప్రిన్స్‌పల్ తీరుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

టీచర్లు పాఠాలు చెబుతారని స్కూల్ కి పంపితే.. విద్యార్థులతో ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారని.. ప్రిన్స్‌పల్ హోదాలో ఉండి కూడా 10 వ తరగతి విద్యార్థితో రొమాన్స్ చేయడం.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం.. సభ్య సమాజం తలదించుకునేలా ఉందని స్థానికులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బీఈవో పాఠశాలకు సమాచారం సేకరించారని అధికారులు అంటున్నారు. ప్రిన్స్‌పల్ కొన్ని ఫోటోలు, వీడియోలు తొలగించినట్లు తేలింది. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. ఈ మధ్యనే పాఠశాల సిబ్బంది, విద్యార్థులు టూర్ వెళ్లగా.. అక్కడ వీరిద్దరూ రొమాన్స్ లో ఉన్నపుడు మరో విద్యార్థి క్లిక్ మనిపించాడు. అవి కాస్త నెట్టంట వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి